TeamIndia – ICC Finals : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత జట్టు ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. టెస్టు చాంపియన్షిప్ సీజన్ ఆసాంతం అదరగొట్టి.. తీరా ఆఖరి మెట్టుపై బోల్తా పడడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ఫైనల్స్లో భారత జట్టు తడబాటును తేలికగా తీసుకోలేకపోతున్నారు. ఈ ఏడాది సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ఉంది. దాంతో, ఆటగాళ్ల నిలకడలేమి, ఫైనల్ తడబాటు ఫ్యాన్స్ను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇప్పటివరకు టీమిండియా(TeamIndia) ఎన్ని ఫైనల్స్లో ఓడిపోయిందో తెలుసా..? చాంపియన్స్ ట్రోఫీ 2000, వన్డే వరల్డ్ కప్ 2003, టీ20 వరల్డ్ కప్ 2014, చాంపియన్స్ ట్రోఫీ 2017, టెస్టు చాంపియన్షిప్ 2021, 2023లో భారత జట్టు రెండో స్థానానికే పరిమితమైంది.
వన్డే వరల్డ్ కప్ 1983.. ఈ ఏడాది టీమిండియా వరల్డ్ చాంపియన్గా అవతరించింది. కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ను చిత్తు చేసింది. తొలిసారి వన్డే వరల్డ్ కప్ను అందుకుంది.
వరల్డ్ కప్ అందుకుంటున్న కపిల్ దేవ్(1983)
చాంపియన్స్ ట్రోఫీ 2000 – సౌరభ్ గంగూలీ(Sourabh Ganguly) కెప్టెన్సీలో భారత్ ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
చాంపియన్స్ ట్రోఫీ 2002 – శ్రీలంకతో కలిసి టీమిండియా సంయుక్త విజేతగా నిలిచింది.
వన్డే వరల్డ్ కప్ 2003 – ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. రికీ పాంటింగ్ సెంచరీతో మెరిశాడు. లక్ష్య ఛేదనలో ఇండియా పరిమితమైంది.
టీ20 వరల్డ్ కప్ 2007 – ఐసీసీ తొలిసారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి కప్పు అందుకుంది.
వన్డే వరల్డ్ కప్ 2011- ఎంఎస్ ధోనీ(MS Dhoni) సారథ్యంలో భారత జట్టు సొంతగడ్డపై వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ(నాటౌట్) సిక్స్ కొట్టడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ 2013 – ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన భారత్, ఇంగ్లండ్ను ఓడించి చాంపియన్గా అవతరించింది. రవీంద్ర జడేజా ఆల్రౌండ్ షో(33 పరుగులు, 2 వికెట్లు)తో రాణించాడు.
టీ20 వరల్డ్ కప్ 2014 – శ్రీలంక జట్టు భారత్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. కుమార సంగక్కర(52) అర్ధ శకతం బాది లంకకు కప్పు అందించాడు.
చాంపియన్స్ ట్రోఫీ 2017 – దాయాది పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. పాక్ నిర్దేశించిన 339 పరుగుల ఛేదనలో టీమిండియా 158కే కుప్పకూలింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2021 – ఐసీసీ తొలిసారి నిర్వహించిన టెస్టు చాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్కు చేరింది. అయితే.. లార్డ్స్లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. కైలీ జేమీసన్ సంచలన బౌలింగ్తో కివీస్కు విజయాన్ని అందించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 – టీమిండియా వరుసగా రెండో సారి టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టింది. ఓవల్లో జరిగిన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్లో భారత్ 234 పరుగులకే ఆలౌటయ్యింది.