Delhi Capitals : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 60 రన్స్ తేడాతో గెలుపొందింది. అయితే.. ఆ జట్టు ఐదుగురు విదేశీ ప్లేయర్స్తో బరిలోకి దిగి వార్తల్లో నిలిచింది. మామూలుగా అయితే.. టీ20 లీగ్ ఏదైనా నలుగురు విదేశీ ప్లేయర్స్ను మాత్రమే తుది జట్టులో ఆడేందుకు అనుమతిస్తారు. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఐదుగురు ఫారెన్ క్రికెటర్లతో ఆడింది. అది ఎలా సాధ్యమైందంటే.. ఆ జట్టులో ఐదో ప్లేయర్ అసోసియేటెడ్ నేషన్కు చెందిన ఆమె. అవును.. తారా నోరిస్ అమెరికాకు చెందిన క్రికెటర్. అసోసియేటెడ్ ప్లేయర్ ఉన్న జట్టు ఐదుగురు విదేశీయులతో బరిలోకి దిగేందుకు అనుమతిస్తారు.
విశేషం ఏంటంటే.. ఈ లీగ్లో పాల్గొంటున్న ఐదు ఫ్రాంఛైజీలలో ఢిల్లీ క్యాపిటల్స్కు మాత్రమే అసోసియేటెడ్ ప్లేయర్ ఉంది. ఈ మ్యాచ్లో నోరిస్ ఐదు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బకొట్టింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిట్స్ మేగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), మరిజానే కాప్ (దక్షిణాఫ్రికా), అలిసే క్యాప్సీ (ఇంగ్లండ్), జెస్ జొనాసెన్ (ఆస్ట్రేలియా), తారా నోరిస్ (అమెరికా)లతో బరిలోకి దిగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు మేగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) వీర బాదుడు బాదారు. జెమీమా రోడ్రిగ్స్ (22), మరిజానే కాప్ (39) ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఛేజింగ్లో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. 224 లక్ష్య ఛేదనలో ఆ జట్టు ఆది నుంచి తడబడింది. ఢిల్లీ బౌలర్ తారా నోరిస్ ఐదు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బకొట్టింది.