ఢాకా: కొత్త సారథి నజ్ముల్ హుసేన్ శాంటో (104 బ్యాటింగ్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో.. న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 310 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 317 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4, మోమినుల్ హక్ మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా.. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. నజ్ముల్ హుసేన్ సూపర్ సెంచరీకి తోడు మోమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీమ్ (43 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. కివీస్ బౌలర్లలో ఏజాజ్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న బంగ్లాదేశ్ ప్రస్తుతం 205 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిగిలిన ఏడు వికెట్ల సాయంతో బంగ్లా ఇంకెన్ని పరుగులు చేసి కివీస్ ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి.