హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : గత ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్తో పాటు విజయానంద్, మీర్ సమి అలీ, మహమ్మద్ యూసుఫ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.
తదుపరి విచారణను జూన్ 23కు వాయిదా వేస్తూ జస్టిస్ టి.వినోద్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021-22లో హెచ్సీఏ నిర్వహించిన రెండు రోజుల లీగ్లో నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ను అనుమతించాలని 2021 ఆగస్టులో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో జిల్లా అసోసియేషన్ దాఖలు చేసిన కోర్టు ధికార పిటిషన్ శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది.