న్యూఢిల్లీ: భారత్తో జరిగే టీ20 సిరీస్కు విండీస్ ప్లేయర్ షిమ్రాన్ హిట్మేయర్ దూరం అయ్యాడు. ఫిట్నెస్ లేని కారణంగా అతన్ని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదు. 16 సభ్యులతో కూడిన టీ20 జట్టును వెస్టిండీస్ ప్రకటించింది. భారత్తో విండీస్ మొత్తం మూడు టీ20లు ఆడనున్నది. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్కతాలో ఆ మ్యాచ్లు జరగనున్నాయి. దీనికి ముందు అహ్మదాబాద్లో ఫిబ్రవరి 6,9,11 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. పోలార్డ్ నేతృత్వంలోని వన్డే జట్టును విండీస్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన టీ20 సిరీస్కు కూడా హిట్మేయర్ దూరం అయ్యాడు. ఫిట్నెస్ పరీక్షలో అతను విఫలం అయ్యాడు. అయితే హిట్మేయర్ కోలుకోలేకపోతున్నాడని, అందుకే ఇంగ్లండ్తో ఆడిన జట్టునే కొనసాగించనున్నట్లు కోచ్ ఫిల్ సిమ్మన్స్ తెలిపాడు.