పోచెఫ్స్ట్రోమ్: జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో భారత అమ్మాయిలకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0-3తో మూడుసార్లు చాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఆ జట్టు తరఫున టెస్సా బీస్మా (12వ నిమిషంలో), లునా ఫొక్కి (53వ ని), జిప్ డికె (54వ ని) ఒక్కో గోల్ సాధించారు. మన అమ్మాయిలు ఎంత ప్రయత్నించినా ఖాతా తెరువలేకపోయారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి కాంస్యం గెలుచుకున్న భారత్.. మంగళవారం కాంస్య పతక పోరులో ఇంగ్లండ్తో తలపడనుంది.