హైదరాబాద్: రాష్ట్రంలో ఔత్సాహిక యువ క్రికెటర్లకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాలలో ఈనెల 20 నుంచి నెల రోజుల పాటు వీటిని ఉచితంగా నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
బాలురకు అండర్ – 14, 16, 19.. బాలికలకు అండర్ – 15, 19 వయో విభాగాల్లో ఈ క్యాంపులను ఉచితంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ మొదలవనుండగా ఆసక్తిగలవారు 18వ తేదీ నుంచి తమ పేర్లను నమోదుచేసుకోవాలని కోరారు. మరి న్ని వివరాలకు హెచ్సీఏ అధికారిక వెబ్సైట్ (http://www. hycri cket.org) ను సంప్రదించాలని సూచించారు.