హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై నెలకొన్న ప్రతిష్టంభనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈనెల 25న ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఓసారి ఆన్లైన్లో టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. అయితే టిక్కెట్ల కోసం పోలీస్శాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్న వార్తలను హెచ్సీఏ సోమవారం తోసిపుచ్చింది.
తమకు ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవని, నిరాధార వదంతులను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి తప్పుడు వార్తలను లెక్కలోకి తీసుకోకుండా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు హెచ్సీఏ పేర్కొంది. టిక్కెట్ల విషయంలో తప్పుడు వార్తలను ఎవరు నమ్మవద్దని ఒక ప్రకటనలో సూచించింది.