కామారెడ్డి, జనవరి 11: జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ టోర్నీలో హర్యానా చాంపియన్గా నిలిచింది. కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కబడ్డీ పోటీలు ముగిశాయి. గురువారం హోరాహోరీగా సాగిన పైనల్ మ్యాచ్లో హర్యానా 58-51తో కర్ణాటకపై అద్భుత విజయం సాధించింది.
నువ్వానేనా అన్నట్లు కడదాకా సాగిన మ్యాచ్లో హర్యానానే విజయం వరించింది. మూడు, నాలుగు స్థానా ల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో ఆతిథ్య తెలంగాణ..ఢిల్లీ టీమ్ను మట్టికరిపించింది. విజేతలకు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ట్రోఫీలు అందజేశారు.