వరంగల్, సెప్టెంబరు 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పంజాబ్ యువ స్ప్రింటర్ హర్మిలన్కౌర్ బైన్స్ మళ్లీ మెరిసింది. ఇప్పటికే 1500మీటర్ల రేసులో పసిడి కాంతులు పూయించిన హర్మిలన్ (2:03:82సె) శనివారం 800మీటర్ల రేసులో స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టుకుంది. చందా(ఢిల్లీ), రాచ(హర్యానా) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మహిళల ట్రిపుల్ జంప్లో తమిళనాడుకు చెందిన ఐశ్వర్య 6.52మీటర్ల దూరంతో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రేణు, భైరవి రాయ్ రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.