FIH Hockey League | భువనేశ్వర్: కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ డబుల్ ధమాకా మోగించడంతో ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్లో భారత్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో భారత్ 4-1తో స్పెయిన్ను మట్టికరిపించింది.
భారత్ తరఫున హర్మన్ప్రీత్ (7వ, 20వ నిమిషాల్లో) రెండు గోల్స్ బాదగా.. జుగ్రాజ్ సింగ్ (24వ ని.లో), లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (50వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. స్పెయిన్కు మార్క్ ఏకైక గోల్ అందించాడు.