ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్(IPL 2025)కు అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గత సీజన్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన నేపథ్యంలో పాండ్యాపై ఒక మ్యాచ్ బ్యాన్ విధించారు. ఆదివారం చెన్నైతో జరిగే మ్యాచ్లో ముంబై జట్టుకు సూర్య సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు పాండ్యా తెలిపాడు.
𝗦𝗞𝗬 (CAPTAIN) for our opening match 🆚 CSK ✨💙#MumbaiIndians #PlayLikeMumbai #CSKvMI pic.twitter.com/fSbtKgVrVV
— Mumbai Indians (@mipaltan) March 19, 2025
భారత సీనియర్ టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేపడుతున్నాడు. అతని నేతృత్వంలోని ఇండియా జట్టు ఇటీవల 4-1 తేడాతో ఇండ్లండ్పై హోమ్ సిరీస్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ సిరీస్లో సూర్య బ్యాటింగ్లో రాణించలేదు. 5 ఇన్నింగ్స్లో అతను కేవలం 38 రన్స్ మాత్రమే చేశాడు. అయితే ముంబై ఇండియన్స్ జట్టు ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవాళ పాండ్యా మాట్లాడుతూ.. ఇండియాకు సూర్య లీడ్ చేస్తున్నాడని, తాను లేని పక్షంలో అతనే ఉత్తమ ఛాయిస్ అవుతాడని పేర్కొన్నాడు.
🚨 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐚𝐧𝐝 𝐌𝐚𝐡𝐞𝐥𝐚 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐏𝐫𝐞-𝐬𝐞𝐚𝐬𝐨𝐧 𝐏𝐫𝐞𝐬𝐬 𝐂𝐨𝐧𝐟𝐞𝐫𝐞𝐧𝐜𝐞 🚨
Stay tuned for all updates here ➡️ https://t.co/hjq62ItHrf#MumbaiIndians #PlayLikeMumbai
— Mumbai Indians (@mipaltan) March 19, 2025
పాండ్యాపై బ్యాన్ ఉన్న విషయాన్ని బీసీసీఐకి చేరవేసినట్లు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే వెల్లడించారు. గత సీజన్లో మూడు సార్లు స్లో ఓవర్ రేటు వల్ల పాండ్యాపై నిషేధం విధించాల్సి వచ్చిందన్నాడు. 2024 సీజన్లో ముంబై జట్టు 10 మ్యాచుల్లో ఓడి కేవలం నాలుగింటిలో మాత్రమే నెగ్గింది. ఆ సీజన్లో ముంబైకి పాండ్యా కెప్టెన్సీ చేపట్టాడు.