Hardik Pandya: ఆదివారం సాయంత్రం నుంచి ఆసక్తికరంగా సాగిన హార్ధిక్ పాండ్యా `బదిలీ ప్రక్రియ`కు తెరపడింది. ఆదివారం రిటెన్షన్ ప్రక్రియ మొదలైన వెంటనే హార్ధిక్ను గుజరాత్ రిటైన్ చేసుకోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఇక దీనిని మరింత రక్తికట్టిస్తూ రాత్రి 8 గంటల తర్వాత హార్ధిక్ ముంబైకి వస్తున్నాడని వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇది సస్పెన్స్ సినిమాను తలపించింది. కానీ ఈ సస్పెన్స్కు తెరదించుతూ ముంబైతో పాటు ఐపీఎల్ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ముంబై ఇండియన్స్ ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. హార్ధిక్ ముంబై జెర్సీ వేసుకున్న ఫోటోను షేర్ చేస్తూ `వెల్కమ్ బ్యాక్ హోమ్` అంటూ ట్వీట్ చేసింది. ఆ జట్టు యజమానులు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలు కూడా హార్ధిక్ రాకను స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. హార్ధిక్ కోసం ముంబై.. గతేడాది వేలంలో రూ. 17.5 కోట్లు వెచ్చించి దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ను వదులుకుంది. గ్రీన్ను రాయల్ ఛాలంజర్స్ బెంగళూరుకు ట్రేడ్ చేసింది.
Welcome back 𝗛𝗢𝗠𝗘! 💙 #OneFamily https://t.co/rrP5s36xn2
— Mumbai Indians (@mipaltan) November 27, 2023
ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. హార్ధిక్ ముంబైకి రిటర్న్ వచ్చాడని, గ్రీన్ ఆర్సీబీకి ట్రేడ్ అయ్యాడని ట్వీట్లో పేర్కొంది. గ్రీన్ను వదిలేసి హార్ధిక్ను ట్రేడ్ చేసుకున్నందుకు గాను ముంబై వద్ద పర్స్ వాల్యూ రూ. 17.75 కోట్లుగా ఉండగా గుజరాత్ టైటాన్స్ పర్స్ వాల్యూ అమాంతం పెరిగింది. ప్రస్తుతం గుజరాత్ వద్ద రూ. 38.15 కోట్ల నగదుఉంది.
📢 Announced!
𝗛𝗮𝗿𝗱𝗶𝗸 𝗣𝗮𝗻𝗱𝘆𝗮 ➡️ 𝗠𝘂𝗺𝗯𝗮𝗶 𝗜𝗻𝗱𝗶𝗮𝗻𝘀
𝗖𝗮𝗺𝗲𝗿𝗼𝗻 𝗚𝗿𝗲𝗲𝗻 ➡️ 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗮𝗻𝗴𝗮𝗹𝗼𝗿𝗲#IPL pic.twitter.com/oyuAtP7Q27
— IndianPremierLeague (@IPL) November 27, 2023