న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిమ్స్లో కరోనా టీకా తీసుకున్నారు. మొదటి డోసు మార్చి 1వ తేదీన తీసుకోగా, రెండో డోసును ఇవాళ తీసుకున్నారు. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ను మోదీ తీసుకున్నారు. అయితే మోదీకి మొదటి, రెండో డోసు టీకా ఇచ్చిన నర్సులు.. పీ నివేద(పుదుచ్చేరి), నిషా శర్మ(పంజాబ్).
ఈ సందర్భంగా సిస్టర్ పీ నివేద, నిషా శర్మ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి మొదటి, రెండో డోసు టీకాను ఇవ్వడం మరిచిపోలేను అని పేర్కొన్నారు. మోదీకీ టీకా ఇవ్వడం అరుదైన అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. తమతో మోదీ మాట్లాడారని, ఇది మరిచిపోలేని అనుభూతి అని చెప్పారు. టీకా ఇచ్చిన సందర్భంగా మోదీతో ఫోటో దిగడం గొప్ప సంతోషాన్ని ఇచ్చిందని నర్సులు పేర్కొన్నారు.
ప్రధాని తన మొదటి డోసు తీసుకున్న 37 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో విడుత ప్రారంభమైన మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.
ఈ సందర్భంగా.. ‘నేను ఎయిమ్స్లో ఈరోజు కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నాను. కరోనా వైరస్పై జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. అర్హులైనవారు వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ కోసం CoWin.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..