లండన్: భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్కు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో శాశ్వత సభ్యత్వం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వీరిద్దరికి ఎంసీసీ మంగళవారం గౌరవ సభ్యత్వం ప్రకటించింది. అత్యధిక వికెట్లు తీసిన కోటాలో వీరిద్దరికీ గుర్తింపు దక్కింది. అన్ని ఫార్మాట్లలో కలిపి హర్భజన్ 700కు పైగా అంతర్జాతీయ వికెట్లు తీశాడు. టెస్టు(103)ల్లో అత్యధిక (417) వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా భజ్జీ కొనసాగుతున్నాడు. ఇక మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీనాథ్ వన్డేల్లో 315, టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టాడు. శ్రీనాథ్ ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ ప్యానల్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరితో పాటు మొత్తం 18 మంది ఆటగాళ్లకు ఎంసీసీ శాశ్వత సభ్యత్వం కల్పించింది. వీరితో పాటు హషీమ్ ఆమ్లా, ఇయాన్ బెల్, ఇయాన్ బిషప్, అలెగ్జాండర్ బ్లాక్వెల్, చందర్పాల్, అలిస్టర్ కుక్, గ్రాంట్ ఫ్లవర్, గిబ్స్, హెరాత్, కలీస్, మార్టిన్, సారా మెక్గ్లాశన్, శర్వాన్, సారా టేలర్, మార్కస్ ట్రెస్కోతిక్ ఈ గౌరవాన్ని పొందిన వారిలో ఉన్నారు.