మహబూబ్నగర్ టౌన్: జిల్లా కేంద్రంలో జరిగిన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ఆతిథ్య పాలమూరు జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం స్థానిక శ్రీరామ ల్యాండ్మార్క్లో పాలమూరు స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్లో మహబూబ్నగర్ 7-4 తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. విజేతలకు మహబూబ్నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారథి ట్రోఫీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెక్కరి రాంరెడ్డి, రమేశ్కుమార్, రాజేందర్రెడ్డి, శాంత, హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.