హైదరాబాద్, ఆట ప్రతినిధి: సోనెపట్(హర్యానా) వేదికగా ఈనెల 26 నుంచి మొదలయ్యే నాల్గవ జాతీయ జూనియర్ మహిళల బాక్సింగ్ టోర్నీకి రాష్ట్ర గురుకుల విద్యార్థులు హైమావతి, హర్షిత ఎంపికయ్యారు. సికింద్రాబాద్లో జరిగిన రాష్ట్ర బాక్సింగ్ చాంపియ్షిప్లో సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు రెండు స్వర్ణాలు సహా రెండు రజతాలతో మెరిశారు. హైమావతి, వర్షిత పసిడి పతకాలతో ఆకట్టుకోగా, అశ్విక్, ఎబ్సికా రజతాలు దక్కించుకున్నారు.