న్యూఢిల్లీ: భారత హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఏఐ)కి కేంద్ర క్రీడాశాఖ మంగళవారం అధికారికంగా గుర్తింపునిచ్చింది. దేశంలో హ్యాండ్బాల్ కార్యకలాపాలు నిర్వహించేందుకు హెచ్ఏఐకి గ్రీన్సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి అర్సనపల్లి జగన్మోహన్రావు పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ హ్యాండ్బాల్తో పాటు ఆసియా హ్యాండ్బాల్ సంఘం, ఐవోఏ గుర్తింపు దక్కించుకుందని ఆయన తెలిపారు.