బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. నాలుగేండ్ల తర్వాత బర్మింగ్హామ్ వేదికగా మెగాటోర్నీ మొదలవుతున్నది. గతానికి భిన్నంగా ఈసారి సైక్లింగ్, జిమ్నాస్టిక్స్లో సత్తాచాటాలని భారత ప్లేయర్లు పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో ఈ రెండు క్రీడా విభాగాల్లో కొత్త కోచింగ్ బృందంతో అథ్లెట్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. తన అనుమతి లేకుండా వీడియో తీసారంటూ తెలంగాణ యువ జిమ్నాస్ట్ అరుణారెడ్డి ఆరోపణలతో రోహిత్ జైస్వాల్ను తప్పించగా, అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా సైక్లింగ్ కోచ్పై వేటు పడింది.
దీంతో రోహిత్ స్థానంలో సీనియర్ బిశ్వేశ్వర్ నందికి బాధ్యతలు అప్పగించారు. మహిళల జిమ్నాస్టిక్స్ బృందానికి ప్రణతి నాయక్ సారథ్యం వహిస్తుండగా, ప్రొతిష్ట సమంతపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సత్యజిత్ మండల్, యోగేశ్వర్ సింగ్, సైఫ్ తంబోలి రాణించాలన్న కసితో ఉన్నారు. మరోవైపు కామన్వెల్త్లో భారత సైక్లింగ్ బృందం బోణీ కొట్టాలని చూస్తున్నది. యువ సైక్లిస్ట్లు రొనాల్డో సింగ్, డేవిడ్ బెక్హమ్, ఎస్బో అల్బెన్, మయూరి లూట్ కచ్చితంగా పతకాలు గెలుస్తారన్న అంచనాలు ఉన్నాయి.