హైదరాబాద్, ఆట ప్రతినిధి: సౌత్ జోన్ జూనియర్ గోల్ఫ్ టోర్నీలో గురుకుల అమ్మాయిలు సత్తాచాటారు. కర్ణాటక వేదికగా జరిగిన పోటీల్లో అమూల్య, అఖిల ఉత్తమ గోల్ఫర్లుగా నిలిచారు. ‘బి’ కేటగిరీలో అమూల్య విజేతగా నిలువగా.. ‘ఎ’ కేటగిరీలో అఖిల రన్నరప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. వీరితో పాటు అనూష, ప్రెసిల్ల తమతమ విభాగాల్లో రాణించారు. టోర్నీ ఆసాంతం తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఏడుగురు గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.