హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పంచకుల(హర్యానా) వేదికగా వచ్చే నెల 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే యూత్ గేమ్స్లో వీరు బరిలోకి దిగనున్నారు. ఎంపికైన ఎనిమిది మందిలో నందిని(100మీ హర్డిల్స్, లాంగ్జంప్), మాయావతి(100మీ, 200మీ), ప్రణయ్(లాంగ్జంప్), భాగ్యలక్ష్మి(800మీ, 1500మీ), గంగోత్రి, అర్చన (జూడో), వెంకటేశ్, కిషోర్(ఖోఖో) ఉన్నారు.