ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ సంజూ శాంసన్ (47) అర్ధశతకానికి మూడు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. యువ ఆటగాడు సాయి కిశోర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన శాంసన్.. లాంగాన్లో అల్జారీ జోసెఫ్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 79 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పడిక్కల్, బట్లర్ ఉన్నారు.