రాజస్థాన్తో జరుగుతున్న ప్లేఆఫ్స్ మ్యాచ్లో గుజరాత్ జట్టుకు అద్భుతమైన ఆరంభం దక్కింది. సాహా (0) నిరాశపరిచినా.. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ వేడ్ (27 నాటౌట్) ధాటిగా ఆడాడు. అతనితోపాటు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (31 నాటౌట్) కూడా ధనాధన్ షాట్లు ఆడాడు. దాంతో తొలి 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జట్టు ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.