ఐపీఎల్ ఫైనల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అడుగు పెట్టింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన గుజరాత్.. నేరుగా ఫైనల్ చేరింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.
ఫామ్లో ఉన్న సాహా (0) డకౌట్ అయ్యాడు. అయితే మాథ్యూ వేడ్ (35), శుభ్మన్ గిల్ (35) ఇద్దరూ నిలకడగా ఆడి జట్టును ఆదుకున్నారు. వీళ్లు అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (40 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (68 నాటౌట్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.
చివరి ఓవర్లో 16 పరుగులు కావలసిన స్థితిలో.. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన మిల్లర్ గుజరాత్కు మరపురాని విజయాన్నందించాడు. దీంతో నేరుగా గుజరాత్ నేరుగా ఫైనల్ చేరింది. అయితే రాజస్థాన్కు కూడా మరో అవకాశం ఉంది. బుధవారం జరిగే ఎలిమినేటర్లో విజేతతో రాజస్థాన్ పోటీ పడుతుంది.