రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. నిదానంగా ఆడుతున్న గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా (34) పెవిలియన్ చేరాడు. చాహల్ వేసిన 14వ ఓవర్ రెండో బంతిని ఆడేందుకు ప్రయత్నించిన పాండ్యా విఫలమయ్యాడు.
దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న యశఃస్వి జైస్వాల్ వైపు బంతి వెళ్లడంతో.. అతని చటుక్కున దాన్ని పట్టేశాడు. దాంతో పాండ్యా మైదానం వీడాల్సి వచ్చింది. అతను అవుటవడంతో డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. 86 పరుగుల వద్ద గుజరాత్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.