గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్ తడబడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ (0) డకౌట్ కాగా.. హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (58) చాలా నిదానంగా ఆడాడు. యువ ఆటగాడు రజత్ పటీదార్ (52) వేగంగా ఆడినప్పటికీ ఇన్నింగ్స్లో వేగం పెరగలేదు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న దినేష్ కార్తీక్ (2) నిరాశ పరిచాడు. మ్యాక్స్వెల్ (33) కాసేపు మెరుపులు మెరిపించాడు కానీ.. 19వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో బెంగళూరు జట్టు ఐదో వికెట్ కోల్పోయింది.