గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ డుప్లెసిస్ (0) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (58), రజత్ పటీదార్ (52), మ్యాక్స్వెల్ (38) రాణించారు. చివర్వలో మహిపాల్ లోమ్రార్ (16) కూడా బ్యాటు ఝుళిపించాడు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
అయితే ఈ పిచ్పై 200 వరకు స్కోరు చేసే అవకాశం ఉందని పిచ్ క్యురేటర్లు భావిస్తున్న నేపథ్యంలో.. బెంగళూరు జట్టు విజయానికి సరిపోయే స్కోరు చేసిందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కోహ్లీ అర్ధశతకంతో ఫామ్లోకి వచ్చినా కూడా.. అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. మొత్తమ్మీద 53 బంతులు ఎదుర్కొన్న అతను 58 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో బెంగళూరు విజయావకాశాలు కష్టంగా కనబడుతున్నాయి. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.