గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ఛేజింగ్కు వచ్చిన పంజాబ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అవతారం ఎత్తిన జానీ బెయిర్స్టో (1) మరోసారి నిరాశ పరిచాడు. ఆరు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసిన అతను.. షమీ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి పెవిలియన్ చేరాడు.
షమీ వేసిన లెంగ్త్ బాల్ను లెగ్సైడ్ పుల్ చేసేందుకు బెయిర్స్టో ప్రయత్నించాడు. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో ఎత్తుగా లేచింది. దాన్ని సంగ్వాన్ అద్భుతంగా అందుకోవడంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది.