గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఓపెనర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు రోహిత్ భారీ షాట్లతో శుభారంభం అందించాడు. అతనికి ఇషాన్ కిషన్ (19 నాటౌట్) నుంచి మంచి సహకారం అందింది.
దీంతో రెచ్చిపోయిన రోహిత్.. కేవలం 24 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. వీటిలో రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. రోహిత్ రెచ్చిపోవడంతో పవర్ప్లే ముగిసే సరికి ముంబై జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగితే ఆ జట్టు భారీ స్కోరు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.