ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. దీటైన ఆరంభం అందించిన శుభ్మన్ గిల్ (52) హాఫ్ సెంచరీ పూర్తయిన కాసేపటికే పెవిలియన్ చేరాడు. మురుగన్ అశ్విన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. లాంగాన్లో పొలార్డ్కు క్యాచ్ ఇచ్చాడు.
కాసేపటికే మరో ఓపెనర్ వృద్ధి మాన్ సాహా (55) కూడా పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన బంతిని గాల్లోకి లేపిన సాహా.. డీప్ స్క్వేర్ లెగ్లో డానియల్ శామ్స్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో గుజరాత్ జట్టు 111 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.