టోక్యో: ఇండియన్ మెన్స్ హాకీ ( Hockey ) టీమ్ సాధించిన అద్భుత విజయంపై సెలబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు టీమ్ను ఆకాశానికెత్తారు. అసాధారణ పోరాటంతో 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో ఇండియన్ టీమ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ గంభీర్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. 1983, 2007, 2011 వరల్డ్కప్ల గురించి మరచిపోండి. హాకీలో సాధించిన ఈ మెడల్ వరల్డ్కప్ కంటే గొప్పది అని గంభీర్ ట్వీట్ చేశాడు.
ఇక మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తనదైన స్టైల్లో హాకీ టీమ్ను ప్రశంసించాడు. చక్ దే ఫట్టే! ఇండియన్ హాకీలో ఓ చరిత్రాత్మక రోజు. 1-3తో వెనుకబడినా మళ్లీ పుంజుకొని 5-3తో బ్రాంజ్ మెడల్ గెలవడం, అది కూడా 40 ఏళ్ల తర్వాత మామూలు విషయం కాదు. సరదాగా అనిపించింది అని వీరూ ట్వీట్ చేశాడు. అటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా హాకీ టీమ్ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.