Graham Thorpe | లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. గత రెండేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న థోర్ప్ సోమవారం తుదిశ్వాస విడిచినట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ తరఫున ఆడిన థోర్ప్.. వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులలో 44.66 సగటుతో 6,774 పరుగులు చేయగా వన్డేలలో 2,830 రన్స్ సాధించారు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాక కొన్నాళ్లపాటు అఫ్గానిస్థాన్ జట్టుకు హెడ్కోచ్గా పనిచేశారు. థోర్ప్ మృతి పట్ల ఇంగ్లండ్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు తమ సంతాపం వ్యక్తం చేశారు.