హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. చెన్నై వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ చాంపియన్షిప్లో ఆరు పతకాలతో సత్తాచాటారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన టోర్నీలో అమూల్య, అనూష స్వర్ణ పతకాలతో మెరువగా, మధుకు రజతం దక్కింది.
అఖిల, ముకుల్, జెరుష కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థి గోల్ఫర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన గురుకుల ప్లేయర్లు పతకాలను ఒడిసిపట్టుకున్నారు. టోర్నీ విజేతలను మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు.