Team India | శ్రీలంకతో వచ్చేనెల నాలుగో తేదీన జరుగనున్న తొలి టెస్ట్ మ్యాచ్కు సీనియర్ బ్యాట్స్మన్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే దూరం కానున్నారు. వారి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ జరుగుతున్నది. శుభ్మన్ గిల్, హనుమా విహారి తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారని పీటీఐ వార్తాకథనం చెబుతున్నది. అలాగే, శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాకప్ ఆప్షన్గా ఉంటారు. మార్చి 4 నుంచి రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానున్నది. మొహాలీలోని పీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్నది.
గతేడాది న్యూజిలాండ్ టూర్లో గాయపడిన శుభ్మన్ గిల్ను తర్వాత సౌతాఫ్రికా టూర్లో జట్టులోకి ఎంపిక చేయలేదు. ఇప్పుడు శుభ్మన్ గిల్లో తిరిగి చట్టులోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నది. గిల్ పరోక్షంలో మయాంక్ అగర్వాల్ చోటు దక్కించుకోవడంతోపాటు జట్టుకు న్యాయం చేశాడు. కనుక శ్రీలంక టెస్ట్ మ్యాచ్లో మయాంక్తో కలిసి సారధి రోహిత్శర్మ ఓపెనింగ్ జోడీగా రానున్నారు. ఛతేశ్వర్ పూజారా స్థానంలో శుభ్మన్ గిల్ మూడో బ్యాట్స్మన్గా వస్తారు. ఇప్పటివరకు శుభ్మన్ గిల్ 10 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు.
శుభ్మన్ గిల్ మూడో స్థానంలో, హనుమా విహారి ఆరో బ్యాట్స్మన్గా రానున్నాడు. వెస్టిండీస్ ఏ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో మిడిలార్డర్లో వచ్చిన గిల్ డబుల్ సెంచరీతోపాటు మెరుగైన ఆటతీరు కనబర్చాడు. అజింక్యా రహానే స్థానే ఐదో బ్యాట్స్మన్గా రిషబ్ పంత్, ఆరో బ్యాట్స్మన్గా హనుమా విహారి వస్తారని భావిస్తున్నారు.