వింబుల్డన్: లేటు వయసులో నాటు ఆటతో సత్తాచాటిన జర్మనీ టెన్నిస్ ప్లేయర్ టజానా మారియా తొలిసారి గ్రాండ్స్లామ్ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 103వ ర్యాంకర్ మారియా 5-7, 7-5, 7-5తో అగ్రశ్రేణి క్రీడాకారిణి జెలెనా ఓస్టపెంకో (లాత్వియా)పై విజయం సాధించింది.
రెండో సెట్లో రెండు మ్యాచ్ పాయింట్లను కాచుకున్న 34 ఏండ్ల మారియా.. ఇప్పటి వరకు ఆడిన 34 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్స్కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం వింబుల్డన్ ‘డ్రా’లో మిగిలిన వారిలో మారియానే వయసులో అందరికంటే పెద్దది. ఇతర మ్యాచ్ల్లో బుజ్కోవా 7-5, 6-2తో గార్సియాపై, జూలె నైమైర్ 6-2, 6-4తో హీతర్ వాట్సన్పై విజయాలు సాధించారు.
మిక్స్డ్ డబుల్స్లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా-మేట్ పవిక్ (క్రొయేషియా) జోడీ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్లో ప్రత్యర్థి వాకొవర్తో సానియా జోడీ ముందడుగు వేసింది.