న్యూఢిల్లీ: మాజీ ఇండియన్ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir).. ఐపీఎల్లో లక్నో సూపర్ గెయింట్స్ జట్టుకు గుడ్బై చెప్పేశాడు. లక్నో జట్టుకు రెండేళ్ల నుంచి గంభీర్ మెంటర్గా చేశాడు. అయితే అతను మళ్లీ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో కలవనున్నట్లు కూడా ప్రకటించేశాడు. గంభీర్ తీసుకున్న నిర్ణయాన్ని కోల్కతా ఓనర్ షారుక్ ఖాన్ స్వాగతించారు.
లక్నో జట్టుకు గంభీర్ మెంటర్గా ఉన్న సమయంలోనే ఆ జట్టు 2022 ఎడిషన్లో ఫైనల్కు వెళ్లింది. ఈ యేటి సీజన్లో లక్నో జట్టు లీగ్ స్టేజ్లో మూడవ స్థానంలో నిలిచింది. కానీ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. లక్నోను వీడిపోతున్న అంశంపై భావోద్వేగమైన సందేశాన్ని గంభీర్ పోస్టు చేశాడు.
❤️❤️ LSG Brigade! pic.twitter.com/xfG3YBu6l4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023