న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త ఫ్రాంచైజీ లక్నోకు భారత మాజీ ఓపెనర్, ఎంపీ గౌతమ్ గంభీర్ మెంటార్గా వ్యవహరించనున్నాడు. అతడిని మెంటార్గా నియమిస్తూ లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం సంజీవ్ గొయెంక గ్రూపు (ఆర్పీఎస్జీ) శనివారం నిర్ణయం తీసుకుంది. దీనిపై గంభీర్ స్పందిస్తూ.. ‘గొప్ప అవకాశం ఇచ్చిన ఆర్పీఎస్జీకి ధన్యవాదాలు. విజేతగా నిలువాలనే కసి నాలో ఇంకా రగులుతూనే ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో చోటు కోసం కాకుండా.. ఉత్తరప్రదేశ్ జట్టు అభ్యున్నతి కోసం కష్టపడతా’అని ట్వీట్ చేశాడు.