కోల్కతా: ఐపీఎల్లో ఆదివారం బెంగుళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో ఒక్క రన్ తేడాతో కోల్కతా జట్టు విజయం సాధించింది. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన జరిగంది. 12 బంతుల్లో 31 రన్స్ అవసరం ఉన్న సమయంలో.. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ డగౌట్ వైపు చూస్తున్నట్లు కెమెరాలకు చిక్కింది. డగౌట్లో ఉన్న టీమ్కు అతను ఏదో చెబుతూ కనిపించాడు. అప్పుడు గౌతం గంభీర్, కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్.. ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగారు. కానీ దేని గురించి అన్న విషయం స్పష్టంగా తెలియదు. కానీ ఆ తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. కేకేఆర్ స్పిన్నర్ సునిల్ నరైన్ స్థానంలో గుర్బాజ్ను సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా దించాలని కేకేఆర్ నిర్ణయించింది. కాలు బొటన వేలుకు గాయం కావడంతో నరైన్ ఇబ్బందిపడుతున్నాడు. కేకేఆర్ అభ్యర్థనను అంపైర్ తిరస్కరించాడు. దీంతో ఫోర్త్ అంపైర్తో గంభీర్ వాగ్వాదానికి దిగాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యశ్ దయాల్ బౌలింగ్లో నరైన్ గాయపడ్డారు.
— Nihari Korma (@NihariVsKorma) April 22, 2024