Gautam Gambhir : వెస్టిండీస్ పర్యటనకు ఐపీఎల్(IPL 2023) స్టార్ రింకూ సింగ్(Rinku Singh)ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు సెలెక్టర్లను తప్పుపట్టారు. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మాజీ కెప్టెన్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఈ విషయంపై స్పందించాడు. భారత జట్టులోకి రావాలంటే రింకూ సింగ్ ఒక్క సీజన్ బాగా ఆడితే సరిపోదని గంభీర్ అన్నాడు. ‘రింకూ సింగ్ దేశవాళీలో ఆ తర్వాత ఐపీఎల్లో పరుగులు సాధించాలి. ఒకవేళ అతను నిలకడగా రాణిస్తేనే టీమిండియాకు ఎంపిక చేయాలి’ అని గంభీర్ అన్నాడు.
అంతేకాదు వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్(T20 WC 2024)పై రింకూ దృష్టి పెట్టాలని ఈ దిగ్గజ క్రికెటర్ సూచించాడు. అయితే.. విండీస్ టూర్కు రింకూను పక్కన పెట్టిన సెలెక్టర్లు తమ పొరపాటు గ్రహించారు. రుతురాజ్ గైక్వాడ్(ruturaj gaikwad) సారథ్యంలోని ఆసియా గేమ్స్(Asian Games 2023) జట్టుకు అతడిని ఎంపిక చేశారు. కోల్కతాకు రెండు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన గంభీర్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Gaints) మెంటర్గా ఉన్నాడు.
ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023) లో రింకూ సింగ్ అకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లతో విరుచుకుపడుతూ కోల్కతాకు ఒంటిచేత్తో విజయాలు అందించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్స్లు బాదాడు. దాంతో, ఓటమి అంచులో ఉన్న కోల్కతా అనూహ్యంగా విజయం సాధించింది.
రింకూ సింగ్
ఆ ఇన్నింగ్స్తో రింకూ ఒక్కసారిగా హీరో అయ్యాడు. అతను ఆ తర్వాతి మ్యాచుల్లోనూ అదే ఊపు కొనసాగించాడు. 14 మ్యాచుల్లో అతను 473 రన్స్ కొట్టాడు. అయినా కూడా నితీశ్ రానా సేన ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. కీలక ఆటగాళ్లు ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ నిలకడగా ఆడకపోవడం ఆ జట్టు అవకాశాల్ని దెబ్బతీసింది.