హైదరాబాద్, ఆట ప్రతినిధి: సెర్బియా వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్రానికి చెందిన గంటా సాయికార్తీక్రెడ్డి, రిత్విక్ చౌదరీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్లో
కార్తీక్, రిత్విక్ ద్వయం 5-7, 6-3, 10-6తో మాథ్యూ, కుగ్ను జోడీపై అద్భుత విజయం సాధించింది. ప్రత్యరికి తొలి సెట్ చేజార్చుకున్నా..వెనుకకు తగ్గని భారత యువ జంట వరుస సెట్లలో మ్యాచ్ను తమ వశం చేసుకుంది.