లక్నో: ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన గంటా సాయికార్తీక్రెడ్డి, ఎస్డీ ప్రజ్వల్ దేవ్ జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల క్వార్టర్స్లో కార్తీక్, ప్రజ్వల్ ద్వయం 2-6, 6-2, 10-7తో విష్ణువర్ధన్, లోమకిన్ గ్రిగోరీ జంటపై విజయం సాధించింది. ప్రత్యర్థికి తొలి సెట్ చేజార్చుకున్నా అద్భుతంగా పుంజుకున్న కార్తీక్, ప్రజ్వల్ వరుస సెట్లలో మ్యాచ్ను దక్కించుకున్నారు.