విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. అతడి సారథ్యంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించింది. సారథిగా తప్పుకోవడం విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బోర్డు గౌరవిస్తుంది. భవిష్యత్లో ఓ ఆటగాడిగా కోహ్లీ జట్టు కోసం మరిన్ని విజయాలు సాధించాలి. భారత జట్టుకు కెప్టెన్గా అపారమైన సేవలు అందించిన విరాట్కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెబుతున్నా. – గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
రాజకీయాలకు వేదికగా బీసీసీఐ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా రాకతో బీసీసీఐ రాజకీయాలకు వేదికగా మారింది. క్రికెట్లో ప్రతి ఆటగాడు సంతృప్తికరమైన స్థాయికి చేరుకున్న తర్వాత వీడ్కోలు పలకడం సహజం. బీసీసీఐ కార్యదర్శిగా జై షా ప్రవేశంతో పరిస్థితులు భిన్నంగా మారాయి. బోర్డు రాజకీయాలకు నిలయమవడంతో ప్రతిభావంతులు రాణించలేకపోతున్నారు. ఎంపికలో రాజకీయాలు జరుగుతున్నాయి. -కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి