కోల్కతా: కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) జట్టు మెంటార్గా మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ వ్యవహరించనున్నాడు. గత రెండు సీజన్లుగా లక్నో సూపర్జెయింట్స్కు మెంటార్గా ఉన్న గంభీర్ తిరిగి కోల్కతా గూటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా గంభీర్ అభిమానులతో పంచుకున్నాడు. లక్నో చీఫ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ను నియమించడం గంభీర్ వీడ్కోలుకు కారణమైనట్లు తెలుస్తున్నది.
ఇటీవల ముంబైలో షారుఖ్ఖాన్తో గంభీర్ సుదీర్ఘంగా సమావేశం కావడం దీనికి మరింత బలం చేకూర్చింది. 2011-17 వరకు కోల్కతాకు ప్రాతినిధ్యం వహించిన గంభీర్ రెండుసార్లు(2012, 14) ఐపీఎల్ చాంపియన్గా నిలిపాడు. రానున్న సీజన్లో చీఫ్ కోచ్ చంద్రకాంత్తో కలిసి ఈ మాజీ కెప్టెన్ కలిసి పనిచేస్తాడని కోల్కతా ఒక ప్రకటనలో పేర్కొంది.