INDvsAUS: నెలన్నరగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరింది. ఆదివారం భారత్ – ఆసీస్ మధ్య తుది పోరు జరగాల్సి ఉంది. అయితే ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశపు హోదాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. సుమారు లక్షకు పైగా ప్రేక్షకులు హాజరుకాబోయే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అభిమానులను అలరించబోయే కళాకారుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది.
ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే మ్యాచ్కు ముందే ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు టాస్ ముగిసిన తర్వాత 1:35 నుంచి 1:50 గంటల దాకా ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఏరోబోటిక్ వైమానిక విన్యాసాలు అలరించనున్నాయి. ఈ మేరకు శుక్రవారమే సూర్యకిరణ్ విమానాలు రిహార్సల్స్ కూడా ముగిశాయి.
మ్యాచ్ మొదలయ్యాక ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో గుజరాత్కు చెందిన సింగర్, లిరిసిస్ట్ ఆదిత్య గధ్వి ప్రదర్శన ఉండనుంది. ఒక ఇన్నింగ్స్ ముగిశాక బాలీవుడ్ గానా బజానా ఉండనుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి, జొనితా గాంధీ, నకాశ్ అజిజ్, అమిత్ మిశ్రా, ఆకాశ సింగ్, అమిత్ మిశ్రా, శ్రీరాంచంద్ర, తుషార్ జోషిల తమ పాటలతో అలరించనున్నారు. ఇన్నింగ్స్ బ్రేక్ ముగిసి రెండో ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్ అండ్ లైట్ షో జరుగనుంది.
It doesn’t get any bigger than this 👌👌
The ICC Men’s Cricket World Cup 2023 Final is filled with stellar performances and an experience of a lifetime 🏟️👏#CWC23 pic.twitter.com/nSoIxDwXek
— BCCI (@BCCI) November 18, 2023
ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను ఇదివరకే క్రికెట్, బాలీవుడ్కు చెందిన అతిరథ మహారథులందరూ అహ్మదాబాద్ చేరుకుంటున్న విషయం విదితమే. ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్ల్స్, గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పాటిల్, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ కూడా హాజరుకానున్నట్టు సమాచారం. అంతేగాక వరల్డ్ కప్ గెలిచిన సారథులందరికీ సన్మానం చేయనున్నట్టు తెలుస్తున్నది.