హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈనెల 24న ఉదయం 7గంటలకు ‘ఫ్రీడమ్ రన్’ నిర్వహిస్తున్నట్లు సాట్స్ వైస్ చైర్మన్, ఎండీ కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. ‘ఫ్రీడమ్ రన్’ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో మొదలై ఎల్బీ స్టేడియం వద్ద రన్ ముగుస్తుందని శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, క్రీడా ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.