న్యూఢిల్లీ: స్వదేశం వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం త్వరలో భారీ సంఖ్యలో టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. మెగాటోర్నీ పట్ల అభిమానుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 8నుంచి ప్రపంచకప్నకు సంబంధించి 4 లక్షల టిక్కెట్లు ఆన్లైన్లో విక్రయానికి అందుబాటులో ఉంచుతామని ఐసీసీ బుధవారం పేర్కొంది. అయితే ఇందులో భారత్ ఆడే మ్యాచ్లతో పాటు మిగతా జట్ల మ్యాచ్ల టిక్కెట్ల విషయంలో ఐసీసీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఐసీసీ అధి కారిక వెబ్సైట్ https://tickets. cricketworl dcup.com ద్వారా టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి.