న్యూఢిల్లీ: థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన అశిశ్ కుమార్, గోవింద్ సహనీ, వీరేందర్ సింగ్, మోనిక తుది పోరులో నిలిచారు. గత ఎడిషన్ స్వర్ణ పతక విజేత ఆశిశ్.. ఈసారి 81 కిలోల సెమీస్ పోరులో 5-0తో మైఖేల్ రాబర్డ్ ముస్కిత (ఇండోనేషియా)ను చిత్తుచేసి మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. మహిళల విభాగం 48 కిలోల సెమీస్లో మోనిక 5-0తో ట్రాన్థి దియం(వియత్నాం)ని మట్టి కరిపించింది. అశిశ్, మోనిక ప్రత్యర్థులపై పూర్తి ఆధిక్యంతో ఏకపక్ష విజయం సాధించి సత్తా చాటారు. పురుషుల 48 కిలోల విభాగంలో గోవింద్ 4-1తో గుయెన్ లిన్ ఫుంగ్ (వియత్నాం)ను చిత్తు చేయగా.. 60 కిలోల బౌట్లో వీరేందర్ వాకోవర్తో ఫైనల్ చేరాడు.