హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు మళ్లీ మెరిశారు. మైసూర్ వేదికగా జరిగిన సౌత్జోన్ జూనియర్ గోల్ఫ్ టోర్నీలో నలుగురు గోల్ఫర్లు పోడియం ఫినిష్ చేశారు. వీరిలో అమూల్య(తొర్రూరు) క్యాటిగిరీ-బీలో రన్నరప్గా నిలువగా, అఖిల(ఇల్లందు), నవీన(సరూర్నగర్), విఘ్నేశ్(చందూర్) ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు.