హైదరాబాద్: వన్ డే ప్రపంచకప్లో భాగంగా మంగళవారం శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ప్రపంచకప్లో అత్యధిక టార్గెట్ చేజింగ్ మ్యాచ్గా నిలవడమేగాక, ఒకే మ్యాచ్లో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డును కూడా ఈ మ్యాచ్ సొంతం చేసుకుంది. మ్యాచ్లో ఇద్దరు శ్రీలంక బ్యాటర్లు, ఇద్దరు పాకిస్థాన్ బ్యాటర్లు సెంచరీలు కొట్టారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. అందులో కుశాల్ మెండిస్ (122; 14 ఫోర్లు, 6 సిక్స్లు), సమర విక్రమ (108; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు చేశారు. ఆ తర్వాత పాకిస్థాన్ 48.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటర్లలో అబ్దుల్లా షఫీక్ (113; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (131; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు నమోదు చేశారు.