వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ సారథి, ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20లలో 600వ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్గా నిలుస్తూ.. క్రికెట్ పుస్తకాలలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్లో సోమవారం మాంచస్టర్ ఒరిజినల్స్తో టీ20 మ్యాచ్ ఆడటం ద్వారా అతడు ఈ రికార్డును సాధించాడు.
ఫ్రాంచైజీ లీగ్లు మొదలయ్యాక దాదాపు అన్ని టోర్నీలలో కనిపించే ఆటగాళ్లలో వెస్టిండీస్ క్రికెటర్లు ముందువరుసలో ఉంటారు. మరీ ముఖ్యంగా టీ20ల క్రేజ్ ప్రారంభమయ్యాక ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్ కూడా ఒకడు. అతడి దూకుడైన ఆటకు ఈ ఫార్మాట్ బాగా సూట్ అయింది. దీంతో అతడు పేరు మోసిన ప్రతి ఫ్రాంచైజీ లీగ్ ఆడాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో పొలార్డ్ తర్వాత స్థానంలో డ్వేన్ బ్రావో (543 మ్యాచ్లు), క్రిస్ గేల్ (463) ఉన్నారు. ఈ ఇద్దరూ విండీస్ వీరులే కావడం గమనార్హం.
వెస్టిండీస్లో నిర్వహించే కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడే పొలార్డ్ భారత్లో జరిగే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆస్థాన ఆల్రౌండర్. ఇక బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) లో అతడు అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడాడు. బంగ్లా ప్రీమియరల్ లీగ్ (బీపీఎల్) లో డాకా గ్లాడియేటర్స్, డాకా డైనమిటీస్కు ఆడాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్ పెషావర్ జెల్మీకి ఆడాడు.
Another milestone for the legend ✨
🧢 Kieron Pollard is the first cricketer to play in 600 T20 matches 👏 pic.twitter.com/3NKzaoGPLZ
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2022